పంజాగుట్టలో భారీ చోరీ

2 Jul, 2017 19:59 IST|Sakshi

వెండి, బంగారం, రూ.4 లక్షల నగదు అపహరణ

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నవీన్ నగర్‌కు చెందిన జితేందర్ అనే వ్యక్తి బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించారు.

కిలోన్నర బంగారం, 7 కిలోల వెండి, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు