లక్ష్మీదేవికి బంగారు కిరీటం

10 Oct, 2016 22:16 IST|Sakshi
లక్ష్మీదేవికి బంగారు కిరీటం
పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి భక్తులు బంగారు కిరీటాన్ని సమర్పించారు. లక్ష్మీదేవి అమ్మవారికి 390 గ్రాముల బంగారు కిరీటం, 51.240 గ్రాముల బంగారు బొందు, సూత్రాలు, తురాయి, దుద్దులు, పార్వతీ అమ్మవారికి  46.220 గ్రాముల బంగారు సూత్రాలు, బొందు సమర్పించారన్నారు. అనంతరం లక్ష్మీదేవి అమ్మవారికి కిరీటం అలంకరించారు. దాతలు, ఆలయ ట్రస్టీ సభ్యులు అడ్డాల ప్రసాద్, నాళం బాబి, తమిరి వెంకటేశ్వరరావు, కోరుకొండ సుబ్బారావు, అర్చకులు నాగబాబు, మల్లేశ్వరరావు, కిష్టప్ప, భక్తులు ఆదిమూలం సోమేశ్వరరావు, కంచర్ల సాయి పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు