స్వర్ణకారుల ఒకరోజు దీక్ష

27 Sep, 2016 23:56 IST|Sakshi
స్వర్ణకారుల ఒకరోజు దీక్ష

నకిరేకల్ః  
 తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నకిరేకల్‌లోని మెయిన్‌ సెంటర్‌లో స్వర్ణకారులు మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల స్వర్ణకారులు పాల్గొన్నారు. స్వర్ణకారులకు ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తి నైపుణ్యం కోసం రూ.5లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు చింతోజు నవీన్‌కుమార్, పానగంటి ఉపేంద్రచారి, ఓంకార చారి, గందసిరి రామకృష్ణ, నరేంద్రచారి ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు