వైవీయూ అధ్యాపకుల మద్దతు కోరిన గోపాల్‌ రెడ్డి

20 Aug, 2016 17:50 IST|Sakshi
వైవీయూ అధ్యాపకుల మద్దతు కోరిన గోపాల్‌ రెడ్డి

వైవీయూ:
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం వైవీయూకు వచ్చారు.  వైవీయూలోని అన్ని విభాగాలను సందర్శించి అధ్యాపక బృందాలతో సమావేశమై తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా తాను చేసిన సేవలను వివరించి రానున్న గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో మద్దతు ప్రకటించాలని కోరారు. ఈయన వెంట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు పీఎస్‌. ఓబులరావు, అశోక్‌కుమార్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వైవీయూ అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు