రగ్బీ జాతీయ జట్టులోకి గోరంట్ల యువకుడు

12 Jun, 2017 23:44 IST|Sakshi

సోమందేపల్లి (పెనుకొండ) : దక్షిణ భారతదేశపు రగ్బీ క్రీడా పోటీల్లో గోరంట్లకు చెందిన మదాని ఆర్మీ అకాడమిలో శిక్షణ పొందుతున్న యువకుడు రఘు ప్రతిభ చాటినట్లు శిక్షకుడు మిలటరీ ఫకృద్దీన్‌ సోమవారం తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో భాగంగా ఆదివారం చెన్నైలో జరిగిన రగ్బీ పోటీల్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువకుడిని పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు