వినాయకుడికి గవర్నర్ తొలి పూజలు

17 Sep, 2015 10:34 IST|Sakshi

హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తొలిపూజలు జరిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఖైరతాబాద్లోని భారీ గణ నాధుడి వద్ద గవర్నర్ ప్రత్యేక తొలి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో గణేశుడికి వారు కొత్త వస్త్రాలు కూడా సమర్పించారు.

మరిన్ని వార్తలు