చల్లూరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి ప్రభుత్వ సాయం

14 Mar, 2016 20:07 IST|Sakshi

వీణవంక (కరీంనగర్) : వీణవంక మండలం చల్లూరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. తొలి విడతగా సోమవారం రూ.90 వేలు ఆమెకు అందజేశారు అధికారులు. కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఓ యువతిపై అక్కడే శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు గత నెలలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు