హామీలను విస్మరించిన ప్రభుత్వం

19 Sep, 2016 23:09 IST|Sakshi
హామీలను విస్మరించిన ప్రభుత్వం

నకిరేకల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నకిరేకల్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను విమర్శించే స్థాయి మంత్రి హరీష్‌రావు, ఎంపీ కవితకు లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ హామీలు నేటికి నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, మండల శాఖ అధ్యక్షుడు తాటికొండ రామమూర్తి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు జిల్లా డాకయ్య, నాయకులు పుట్ట వెంకన్నగౌడ్, కొండేటి శ్రీను, యానాల శ్రీనివాస్‌రెడ్డి, గుడుగుంట్ల సాయన్న, చెరుకు రోశయ్య, పుట్ట సతీష్, ఉయ్యాల శ్రీను, నల్లగొండ వెంకటయ్య తదితరులు ఉన్నారు.  

 

>
మరిన్ని వార్తలు