కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ పాత మండల కార్యాలయం మంగళవారం రాత్రి కుప్పకూలింది. అయితే సదరు భవంతిలో గత కొద్దికాలంగా అధికారులు ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. భారీ వర్షాల కారణంగా భవనం బాగా నాని కుప్పకూలిందని అధికారులు భావిస్తున్నారు.