యాదాద్రిలో ప్రభుత్వ విప్‌ పూజలు

17 Aug, 2016 01:29 IST|Sakshi
యాదాద్రిలో ప్రభుత్వ విప్‌ పూజలు
యాదగిరికొండ: ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ఆమె జన్మదిన సందర్భంగా మంగళవారం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాల ఆలయంలోని ప్రతిష్టామూర్తులకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అష్టోత్తరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీస్వామి, అమ్మవార్ల అశీస్సులతో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆమె వెంట స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులున్నారు. 
 
మరిన్ని వార్తలు