నిలిచిన గౌతమి ఎక్స్‌ప్రెస్‌

1 Oct, 2016 23:53 IST|Sakshi
సామర్లకోట :
కాకినాడ నుంచి బయలుదేరిన గౌతమి ఎక్‌్సప్రెస్‌ రైలు సర్పవరం వద్ద సుమారు అరగంటపాటు నిలిచిపోయింది.  ఎస్‌–1 బోగీలో అంధకారం ఏర్పడడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక వారు అయోమయానికి గురై బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. స్థానిక రైల్వే గార్డు పరిశీలించగా ఎస్‌–1 బోగీ దిగువ భాగంలో ఉన్న డైనమెట్‌ బెల్ట్‌లు తెగిపోయినట్టు గుర్తించారు. దాంతో ఆ బోగీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడిందన్నారు.
 
మరిన్ని వార్తలు