ఘనంగా దాశరథి జయంతి వేడుకలు

25 Aug, 2016 00:20 IST|Sakshi
మరిపెడ : మహాకవి దాశరథి రంగాచార్యులు 89వ జయంతి వేడుకలను మండలంలోని చిన్నగూడూరులో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి దేశగాని కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని రచించిన దాశరథి రంగాచార్యులు మరిపెడ మండలంలో జన్మించడం మాకు గర్వకారణమన్నారు. మహాకవులు దాశరథి కృష్ణమాచార్యులు, రం గాచార్యులు జన్మించిన చిన్నగూడూరు గ్రామాన్ని మండల కేం ద్రంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాయకులు రామడుగు బ్రహ్మం, కొత్త శేఖర్, నీలం శం కరయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు పోలేపాక వెంకన్న, గాడిపెల్లి సోమయ్య, జంపాల సోమన్న, దాసరి సత్తయ్య, నల్ల కృష్ణ, దేశగాని నారాయణ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు