మక్తల్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అందరూ కలిసికట్టుగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.శ్రీనివాసులు, పాపిరెడ్డి, హసన్, నర్సింహ, హస్మొద్దీన్, శంకర్, జయంత్, అశోక్రెడ్డి, ఆనంద్, మైబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.