రూ.15 కోట్లకు అమ్ముడుపోయాడు..

29 Apr, 2016 15:03 IST|Sakshi

- అరకు ఎమ్మెల్యే కిడారిపై విమర్శలు గుప్పించిన గుడివాడ అమర్‌నాథ్

అరకులోయ (విశాఖ)

అరకులోయ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రూ.10 నుంచి రూ.15 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని... వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. శుక్రవారం అరకులోయలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రా ఊటీ అయిన అరకులోయను లూటీ చేసేందుకే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సీఎం చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. దమ్ముంటే కిడారితో రాజీనామా చేయించాలని... అరకులోయ ప్రజలు గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపిస్తారని సవాల్ చేశారు.

 

మరిన్ని వార్తలు