గిన్నిస్‌ రికార్డు చేరువలో గురుకుల విద్యార్థులు

16 Apr, 2017 22:55 IST|Sakshi
గిన్నిస్‌ రికార్డు చేరువలో గురుకుల విద్యార్థులు

అనంతపురం రూరల్‌ : గురుకులాలకు చెందిన విద్యార్థులు గిన్నిస్‌ రికార్డు కోసం చేసిన ప్రయత్నం ఫలిస్తుందని గురుకుల విద్యా సంస్థల కో ఆర్డినేటర్‌ ఉషారాణి అన్నారు. తిరుపతిలో జరిగిన గురుకుల విద్యార్థుల నాట్య విశేషాలను ఆమె ఆదివారం తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలను చాటడానికి రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి వేదికగా  125 పాఠశాలల నుంచి దాదాపు 3,150 మంది విద్యార్థులు పోటీపడగా, జిల్లా తరుపున కురుకుంట అంబేడ్కర్‌ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత నాట్యంతో ఆకట్టుకున్నారని ప్రశసించారు. డాన్స్‌మాస్టర్‌ మక్బుల్‌ శిక్షణలో విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు.

మరిన్ని వార్తలు