అయిభీమవరం (ఆకివీడు) : గురుమార్గం మానవుడికి సన్మార్గమని కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి అన్నారు. అయిభీమవరంలోని టీటీడీ బోర్డు మాజీ చైర్మ¯ŒS కనుమూరి బాపిరాజు నివాసంలో సోమవారం ఆయన బస చేశారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతులు అయిభీమవరం గ్రామం సందర్శించినప్పటి చిత్రాలను బాపిరాజు ఆయనకు చూపించారు. గురుపూజ చేయడం ద్వారా ప్రతి మనిషి సన్మార్గంలో నడుస్తాడని స్వామీజీ అన్నారు. షష్ఠి పండగను అమృత లింగేశ్వరస్వామి ఆలయంలో జరుపుకునే భాగ్యం దక్కిందన్నారు. పురాతన ఆలయాల్ని తక్షణం పునర్నిర్మించాలని సూచించారు. ఆలయాలు వైభవంగా ఉంటేనే గ్రామం సుభీక్షంగా ఉంటుందని చెప్పారు.