2016లోగా హంద్రీ - నీవా పూర్తి చేస్తాం

6 Nov, 2015 11:29 IST|Sakshi

అనంతపురం : 2016 లోగా హంద్రీ - నీవా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో తోటపల్లి, గుండ్లకమ్మ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ గడవులోపే పూర్తి చేస్తామన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనుల పురోగతిని దేవినేని ఉమా ఈ సందర్భంగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు