ఒంగోలు కల్చరల్: ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు భీమనాదం హనుమారెడ్డి తెలుగు భాషాసాహిత్యాలకు చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఆయనను యువకళావాహిని, హైదరాబాద్ సంస్థ నిర్వాహకులు మంగళవారం అమరావతి తెలుగు వెలుగు పురస్కారంతో ఘనంగా సన్మానించారు.
గుంటూరు విజ్ఞాన మందిరంలో ఏర్పాౖటెన కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఏపీ కనీస వేతనాల బోర్డు అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, సంధ్య ఫిలింస్ అధినేత కనగాల సుబ్బారావు, యువకళావాహిని అధ్యక్షుడు వైకె నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొని హనుమారెడ్డిని పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశంజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు Ðð ంకట శ్రీనివాసులు, కోశాధికారి వై కొండారెడ్డి, సంఘం సభ్యులు హనుమారెడ్డికి అభినందనలు తెలిపారు.