పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం

28 Jul, 2016 20:37 IST|Sakshi
పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం
యాదగిరిగుట్ట : స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హనుమ యాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా మండపారాధన, స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త, సారం రుద్రహవనము, మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్రం, యాదాద్రిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా, ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ యాగం నిర్వహించిన సూర్యానారాయణ ఘనాపాఠి తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు