సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

1 Mar, 2017 04:04 IST|Sakshi

జైనథ్‌ : వీఆర్‌ఏలకు వేతనాలను పెంచడాన్ని హర్షిస్తూ సోమవారం మండల కేంద్రంలోని తహాసీల్దార్‌ కార్యాలయం ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే హుస్సేన్, రమణలు మాట్లాడుతూ తాము ఏండ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి, తమ వేతనాలను పెంచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వీఆర్‌ఏలంతా కలిసి తహసీల్దార్‌ బొల్లెం ప్రభాకర్, ఎన్ ఫోర్స్‌మెంట్‌ డీటీ వనజారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలుసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

మరిన్ని వార్తలు