గరగపర్రు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎంకు లేఖ

3 Aug, 2017 23:02 IST|Sakshi
గరగపర్రు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎంకు లేఖ
–బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్‌
తాడితోట, (రాజమహేంద్రవరం సిటీ):  గరగపర్రు వెలి జరిగి ఆగస్టు 5వ తేదీ నాటికి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ గ్రామాన్ని సందర్శించ లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్‌ విమర్శించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన అతిపెద్ద వెలి గరగపర్రు గ్రామంలోనిదేనని ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రులు ఆ గ్రామాన్ని సందర్శించి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని తెలిపారు. సమస్యలు అలానే వెంటాడుతున్నా మీ కుమారుడు లోకేష్‌ మాత్రం అన్ని సమస్యలూ పరిష్కరించినట్లు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన గరపర్రు వెళ్ళేందుకు నిర్ణయించుకున్నానని, అనుమతి కోసం లేఖ రాస్తున్నానని, నాతోపాటు పోలీసులను  పంపిచినాఅభ్యంతరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 5, ఉదయం 10 గంటలకు గరగపర్రు బయలుదేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
మరిన్ని వార్తలు