కువైట్‌లో హస్తవరం వాసి మృతి

1 Feb, 2017 00:28 IST|Sakshi
కువైట్‌లో హస్తవరం వాసి మృతి

కడప కార్పొరేషన్‌: రాజంపేట మండలం హస్తవరం గ్రామపంచాయతీ, చెర్లోపల్లి గ్రామానికి చెందిన డి. వెంకటేష్‌(42) జనవరి 26వ తేదీన కువైట్‌లో గుండెపోటుతో మరణించినట్లు గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్, కువైట్‌ కన్వీనర్‌ ముమ్మడి బాలిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చెర్లో పల్లికి చెందిన వెంకటేష్, రేణుకలకు పదిహేనేళ్లలోపు వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇదివరకే కువైట్‌లో ఉండటంతో వెంకటేష్‌ కూడా పదహారు నెలల క్రితం కువైట్‌ వెళ్లాడు. ఈ నేపథ్యంలో గతనెల 26వ తేదీ గుండెనొప్పితో మరణించారు. విషయం తెలుసుకున్న కువైట్‌ కన్వీనర్‌ బాలిరెడ్డి, సేవాదళ్‌ సభ్యులు నాగసుబ్బారెడ్డి భారత రాయబార కార్యాలయంలో మాట్లాడి మృతదేహాన్ని ఉచితంగా ఇండియాకు పంపే ఏర్పాట్లు చేశారు. చెన్నై నుంచి వారి స్వస్థలం చెర్లోపల్లి వరకూ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అంబులెన్స్‌ సౌకర్యం కల్పించారు. కువైట్‌ ఆసుపత్రిలో వెంకటేష్‌ మృతదేహాన్ని కో కన్వీనర్‌ గోవిందు నాగరాజు, మర్రికళ్యాణ్, సజ్జాద్, ఖాదర్‌బాషా, షేక్‌ సిద్దార్‌ నివాళులర్పించారు..
 

మరిన్ని వార్తలు