రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

31 Jul, 2016 13:04 IST|Sakshi

ఓర్వకల్ (కర్నూలు) : ద్విచక్రవాహనం పై నుంచి పడి ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువబుగ్గ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవానందం హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బైక్ పై వెళ్తుండగా.. గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు