అనంతపురం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిప„ý నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. గురువారం సాయంత్రం మండలంలోని కొడికొండ చెక్పోస్టు, కోడూరు తోపులో పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఏడో వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన బెంగళూరు నుంచి పులివెందులకు వెళ్తూ చెక్పోస్టులో ఆగి అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన గోరంట్ల మండలంలోని జీనం వాండ్లపల్లి వద్ద అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణతో కలిసి వేరుశనగ పంట పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం ఆయనకు ఓడీచెరువు మండల కేంద్రంలో ప్రజలు వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ ఘనస్వాగతం పలికారు. ఆయన కారులో నుంచి దిగగానే ఆయనతో కరచాలనం చేసేందుకు జనులు ఎగబడ్డారు. అందరికీ ఆయన అభివాదం చేశారు. తలుపుల మండలం సిద్దుగూరిపల్లి వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి,జిల్లాసంయుక్త కార్యదర్శి కుర్లి శివారెడ్డి, తదితర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను కలిసి వేరుశనగ పంట నష్టపోయామని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.