యాదాద్రికి పోటెత్తిన భక్తులు

4 Sep, 2016 13:41 IST|Sakshi

యాదగిరిగుట్ట: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం భక్తులు పోటెత్తారు. కొండపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వరుస సెలవు దినాలు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి పోలీసులు అనుమతించ లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు