కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాలు రాష్ట్ర్రంలోకి ప్రవేశించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో పిడుగులు పడే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. శనివారం నంద్యాలలో అత్యధికంగా 55.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి.