తిరుమలలో కుంభవృష్టి

1 Sep, 2016 00:54 IST|Sakshi
తిరుమల ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు
 
సాక్షి, తిర ుమల: తిరుమలలో  కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు భారీ స్థాయిలో వాన కురిసింది. ఆలయ ప్రాంగణం జలమయమైంది. ఆలయంలో నిలిచిన వర్షపు నీటిని మోటార్లతో వెలుపలకు తరలించారు. ఆలయం ముందు, నాలుగు మాడ వీధుల్లో వాన నీరు ఉధృతంగా ప్రవహించింది. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని వెలుపల వచ్చిన భక్తులు భారీ వర్షంలోనే తడుస్తూ వచ్చారు. వృద్ధులు, చంటి బిడ్డలు కష్టాలు చవిచూసారు. ఆలయ సిబ్బంది కూడా జోరువానలోనే ఆలయంలోకి వెళ్లి రావడం కనిపించింది. వర్షం వల్ల ఆలయం ఎదురుగా ఉన్న ఓ దుకాణం కూలింది. ఇక తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో కూడా భారీ స్థాయిలోనే వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు, చిన్నపాటి కొండ చరియలు రోడ్డుపై పడ్డాయి. 
 
 

 

మరిన్ని వార్తలు