కోస్తాంధ్రలో వర్షాలు... ఈదురుగాలులు

18 Sep, 2015 09:59 IST|Sakshi

విశాఖపట్నం : మధ్య భారతంపై తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. అలాగే అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
 

మరిన్ని వార్తలు