సీతారామపురం(నెల్లూరు జిల్లా): సీతారామపురం మండలంలోని దేవమ్మచెరువు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి పోలీసులు, అటవీ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్లో భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అటవీ ప్రాంతంలో సుమారు 50 మందికి పైగా ఎర్ర చందనం నరికేందుకు కూలీలు వెళ్లినట్లు సమాచారం అందడంతో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు ఎర్ర దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి సమాచారంతో మిగిలిన కూలీల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.రాత్రంతా కుంబింగ్ నిర్వహించనున్నట్లు ఆయాశాఖల అధికారులు తెలిపారు.