-

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

10 Apr, 2016 09:49 IST|Sakshi

యాదగిరిగుట్ట (నల్లగొండ) : పరీక్షల సమయం ముగియడంతోపాటు వరుస సెలవులు రావడంతో.. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. యదాద్రి పై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

స్వామివారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులను గుట్టపైకి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు.

మరిన్ని వార్తలు