నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి

12 Nov, 2015 09:59 IST|Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనదారులు గురువారం నుంచి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే జరిమానాలు తప్పవన్నారు.

తొలుత రూ. 100 జరిమానా విధించనున్నారు. ఆ తర్వాత కూడా హెల్మెట్ ధరించకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ చర్యలను కఠినతరం చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.

 

మరిన్ని వార్తలు