సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా

9 Feb, 2017 17:31 IST|Sakshi
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా

హైదరాబాద్‌:
సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టులో నిరుద్యోగులు వేసిన పిల్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిందో తెలపాలని కోరింది.

వారు చేసిన మార్గదర్శకాలను అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు