హెరిటేజ్‌ పరిశ్రమలో గాయపడిన కార్మికుడి మృతి

25 Jun, 2017 23:35 IST|Sakshi

హిందూపురం రూరల్‌ :  హిందూపురం పట్టణం తూముకుంట పారిశ్రామికవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన హెరిటేజ్‌ దాణా పరిశ్రమలో ప్రమాదవశాత్తూ గాయపడిన సికిందర్‌కుమార్‌ (27) ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. వివరాలు.. హెరిటేజ్‌ దాణా పరిశ్రమలో ఈనెల 24న పైకప్పు ఐరన్‌ బ్రేక్‌లు వెల్డింగ్‌ చేస్తుండగా అగ్గిరవ్వలు దాణా ముడి సరుకులో పడి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కార్మికులు సికిందర్‌కుమార్, ముఖేష్‌కుమార్, సెల్వంకుమార్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించగా, ఆదివారం సికిందర్‌కుమార్‌ మృతి చెందినట్లు రూరల్‌ ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు