పాణ్యం: ఆగ్ర హీరో రజినీకాంత్ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో ధనుష్ పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో మంగళవారం ఓ షూటింగ్లో పాల్గొన్నారు. వండర్బార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న పవర్ పాండి చిత్ర షూటింగ్ గ్రామ సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద జరిగింది. చిత్రంలో ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. పాణ్యం మండల జాతీయ రహదారి వేంట పలు సన్నివేశాలను చిత్రీకరరించారు. డాబా వద్ద ధనుష్ తండ్రి, ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ తమ స్నేహితులతో కలిసి చైన్నై నుండి హైదరాబాద్ వరకు ద్విచక్ర వాహనంపై వెళ్లి మార్గ మధ్యలో డాబాల వద్ద భోజనం చేసే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఈ ఒక్క సన్నివేశాన్నే ఉదయం నుండి సాయంత్రం వరకు చిత్రీకించారు. మూడు రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేయనున్నారు. అలాగే ఓర్వకల్లు రాక్గార్డెన్స్లో మరిన్ని చిత్ర సన్నివేశాలు తీయనున్నట్లు మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఎడాది ఏప్రిల్లో రిలీజ్ అవుతుందన్నారు. షూటింగ్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.