కోదాడలో సార్వత్రిక సమ్మె విజయవంతం

2 Sep, 2016 23:29 IST|Sakshi
కోదాడలో సార్వత్రిక సమ్మె విజయవంతం

కోదాడ: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె కోదాడలో విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. బ్యాంకులు, సినిమా హళ్లు తెరుచుకోలేదు. ఆర్టీసీ కార్మికులు కూడ సమ్మెలో పాల్గొనడంతో బస్సులు బస్టాండ్‌ దాటలేదు. ఉదయమే వామపక్ష నాయకులతో పాటు పలు కార్మిక సంఘాలు బస్టాండ్‌ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం  కోదాడ పట్టణంలో జాతీయరహదారి మీద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలని, కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ విధానాలను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో నాయకులు  మేకల శ్రీనివాస్, ఎస్‌కె. లతీఫ్, పోతురాజు సత్యనారాయణ, ఎంఏ షరీఫ్,  ఎస్‌కె. నయీం కుక్కడపు బాబు, ఈదుల కృష్ణయ్య, అంబడికర్ర శ్రీనివాస్, గౌస్, ఎస్‌. రాధాకృష్ణ, కుక్కడపు ప్రసాద్, వీరభద్రం, ముత్యాలు, బాదెరాము, న ర్సింహారావు, ఓరుగంటి ప్రభాకర్, ఉప్పగండ్ల శ్రీనివాస్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు