భూదాన్పోచంపల్లి : చేనేత కార్మికుల కళా నైపుణ్యం అద్భుతంగా ఉందని హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ కొనియాడారు. బుధవారం ఆయన సతీసమేతంగా పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘంలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. అనంతరం చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఆయన వెంట చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, కార్యదర్శి సూరపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సిద్దుల రాంచంద్రం, డైరెక్టర్లు అంకం మురళి, సీత చక్రపాణి, గంజి అంజయ్య తదితరులు ఉన్నారు.