జాతీయ స్థాయి పోటీలకు ‘పురం’ విద్యార్థి

3 Sep, 2016 23:30 IST|Sakshi

చిలమత్తూరు : జాతీయ స్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు స్థానిక ఉర్దూ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని ఆర్బియా ఎంపికైంది. ఆగస్టు 27, 28 తేదీల్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన అంతర్‌ జిల్లాల పోటీల్లో టెన్నికాయిట్‌ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 20న చెన్నెలో జరిగే నేషనల్‌ పోటీల్లో పాల్గొంటుందని పీఈటీ రామ్మూర్తి తెలిపారు. విద్యార్థిని ఎంపికపై సిబ్బంది రహంతుల్లా, ఇర్షాద్, ఓబులేసు, సిద్దిక్‌ సుల్తాన్‌ హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు