అనంతపురం అగ్రికల్చర్ : హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక వర్గం గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ మార్కెటింగ్శాఖ సెక్రటరీ బి.రాజశేఖర్ బుధవారం జీవో జారీ చేశారు. మొదట ఒక సంవత్సరం , ఆ తర్వాత మరో ఆరు నెలలు పొడిగించడంతో పాలక వర్గం ఒకటిన్నర సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆగస్టు వరకు పాలకవర్గం కొనసాగుతుంది.