కడప స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి మహిళల హాకీ పోటీల్లో జిల్లా మహిళల జట్టు విజేతగా నిలిచింది. నంద్యాలలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ పోటీల్లో ఆదివారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో కడప మహిళల జట్టు తూర్పుగోదావరి జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. తొలుత నెల్లూరుతో నిర్వహించిన మ్యాచ్లో 60 తేడాతో, రెండవ మ్యాచ్ విజయనగరంతో 60 తేడాతో విజయం సాధించగా, అనంతపురం జట్టుతో తలపడిన మూడవ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫైనల్మ్యాచ్లో తూర్పుగోదావరి జట్టుపై కడప జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. బెస్ట్ ప్లేయర్ అవార్డును జిల్లా క్రీడాకారిణి జ్యోతి (యర్రగుంట్ల) అందుకుంది. జిల్లా జట్టుకు నిర్వాహకులు ట్రోఫీ, మెడల్స్ అందజేశారు. జిల్లా మహిళల జట్టు విజయం సాధించడంపై జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. సుభాన్బాషా హర్షం వ్యక్తం చేశారు. హాకీ ఇండియా కోచ్ కరియప్ప పర్యవేక్షణలో జిల్లా జట్టుకు ఇచ్చిన శిక్షణ సత్ఫలితాలను ఇచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. ఇదే విజయపరంపర కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.