భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

4 May, 2016 22:38 IST|Sakshi

తూప్రాన్(మెదక్): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లింగారెడ్డిపల్లిలోని అమెజాన్ స్టోన్ క్రషర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు.

దాదాపు 50 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తోపాటు 50 జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్రషర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు