భారీగా గంజాయి స్వాధీనం

24 Jan, 2016 20:35 IST|Sakshi
భారీగా గంజాయి స్వాధీనం

చింతూరు: తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి ఖమ్మం జిల్లా కొత్తగూడెంనకు డీసీఎం వాహనంలో తరలిస్తున్న గంజాయిని చింతూరు గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.46 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, డీసీఎంను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు