ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ఆత్మహత్యాయత్నం

18 Jul, 2016 12:42 IST|Sakshi
- భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
 
విజయనగరం: అనారోగ్యంతో బాధపడుతున్న ఆలుమగలు..ఆస్పత్రుల చుట్టూ తిరగలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ సంఘటనలో భర్త మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. విజయనగరంలోని కల్పన థియేటర్ సమీపంలో ఉంటున్న ఎం.గణేష్ ఓ ఆస్పత్రిలో సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నగణేష్ దంపతులు మనస్థాపంతో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా గణేష్(47) మృతి చెందాడు. భార్య శివకుమారి(42) ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. 
 
మరిన్ని వార్తలు