అనుమానంతో భార్యను చంపేశాడు

26 Apr, 2016 11:15 IST|Sakshi

శామీర్‌పేట్: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. బాలాజీనగర్‌లోని చుక్కమ్మ బస్తీకి చెందిన రాజేష్, గౌతమి(25) దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది.

దంపతుల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాజేష్ బెల్టుతో భార్యను మెడ నులిమి చంపేశాడు. ఆమెపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని చుట్టుపక్కల వారు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు