గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట కుమ్మరిపేటలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. మాణిక్యాలరావు అనే వ్యక్తి కుటుంబకలహాలతో భార్య శిఖా వనజాక్షి (40)ని కిరాతకంగా చంపాడు. నిద్రిస్తున్న వనజాక్షి గొంతుకోసి హత్యచేశాడు. గత కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మాణిక్యాలరావు పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.