భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

27 Aug, 2016 23:38 IST|Sakshi
రాయపట్నం (ధర్మపురి) : భార్య కాపురానికి రావడంలేదని భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాయపట్నంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాయపట్నం గ్రామానికి చెందిన కాసారపు రాకేష్‌ (25)కు అదే గ్రామానికి చెందిన జ్యోతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో జ్యోతి పుట్టింటికి వెళ్లింది. పలుమార్లు కాపురానికి రావాలని కోరినా ఆమె స్పందించడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్‌ శుక్రవారం రాత్రి గ్రామంలోని తాగునీటి బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 
నాడు చెల్లి.. నేడు అన్న..
రాకేశ్‌ ఆత్మహత్య చేసుకున్న బావిలోనే ఆయన చెల్లి కాసారపు రాణి జూలై 11న దూకి చనిపోయింది. ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతో అందులో దూకింది. నెలన్నర వ్యవధిలోనే అన్నాచెల్లెలు చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
మరిన్ని వార్తలు