ఐస్‌ శివలింగ ఆకర్షణ

15 Sep, 2016 23:45 IST|Sakshi
ఐస్‌ శివలింగ ఆకర్షణ
 
చిగురుపాడు (అచ్చంపేట)  : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్‌ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. స్వామివారికి రెండున్నర క్వింటాళ్ల బంతి పూలతో గజమాల వేశారు. ఈ అందమైన దశ్యాలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. యూత్‌ సభ్యులు కందుకూరి ఏడుకొండలు, పోలిశెట్టి చెంచయ్య, నాగేశ్వరరావు, నరసింహారావు, ఆంజనేయులు, కిలారి బజారు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.   
 
మరిన్ని వార్తలు