-

గెస్ట్హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు

26 Oct, 2015 17:55 IST|Sakshi

కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ అధికారిక వసతి గృహంలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదు జంటలను అరెస్ట్ చేసి కీసర పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు