బైకు అదుపు తప్పి

19 Aug, 2016 22:51 IST|Sakshi
బైకు అదుపు తప్పి
  •  వ్యక్తి మృతి
  • పెద్దదోర్నాల : మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కర్నూలు–గుంటూరు రోడ్డు కొర్రప్రోలు సమీపంలో శుక్రవారం జరిగింది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. నల్లగుంట్లకు చెందిన బైరబోయిన చిన్నయ్య(50) చర్లోపల్లిలో బ్యాంకు పనులు ముగించుకొని బైకుపై స్వగ్రామం బయల్దేరాడు. కొర్ర ప్రోలు సమీపంలో బైకు అదుపుతప్పటంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో  మృతి చెందాడు. ఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మార్జిన్లలో చౌడు మట్టి తోలారని, దీనివల్లే చిన్నయ్య మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య మహాలక్ష్మమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మరో కుమారుడు రెండేళ్ల క్రితం పొలంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. రెండేళ్లలో వేర్వేరు సంఘటనల్లో కుమారుడు, భర్తను కోల్పోయిన మహాలక్ష్మమ్మ రోదనలు స్థానికులను కలచి వేశాయి.   

     

మరిన్ని వార్తలు