కనగల్ : ప్రమాదవశాత్తు బైక్ ఢీకుని బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలుడు నీలకంఠం అభిరామ్ రోడ్డు దాటుతుండగా మండల కేంద్రంకు చెందిన పాలకూరి నగేశ్ నల్లగొండ వైపు నుంచి బైక్పై వస్తూ ఢీకొట్డాడు. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నల్లగొండ తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు.