టెన్త్‌ సప్లమెంటరీ ఉత్తీర్ణత 82.03 శాతం

17 Jul, 2016 19:22 IST|Sakshi

–రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం
నల్లగొండ : పదో తరగతి సప్లమెంటరీ ఫలితాల్లో నల్లగొండ జిల్లా విద్యార్థులు 82.03 ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సప్లమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 8,225 మంది పరీక్షలు రాయగా 6,747 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 4,438 మందికిగాను 3,550 (79.99శాతం), బాలికలు 3,787 మందికిగాను 3,197 (84.42శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  
 

>
మరిన్ని వార్తలు